by సూర్య | Sat, Mar 21, 2020, 12:30 PM
కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యలో ఇటలీ చైనాను దాటిపోయింది. ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627 మంది మరణించారు. దీనితో ఇటలీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4932కు చేరింది. ఇప్పటి వరకూ 41 వేలమందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. కరోనా మృతుల్లో ఇటలీ వాటా 36.6 శాతంగా నమోదయింది. ప్రపంచంలో మూడవ వంతు మరణాలు ఇటలీలో సంభవించాయి.
Latest News