by సూర్య | Fri, Mar 20, 2020, 07:45 PM
ప్రధాని నరేంద్రమోదీ నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంపై శుక్రవారం ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ చివరికి న్యాయమే విజయం సాధించిందనీ, దీంతో మహిళలకు సమాజంలో గౌరవం, భద్రతలపై మరింత భరోసా కల్పించినట్టైందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతపై దృష్టిపెట్టి, సమానత్వం, సమాన అవకాశాలకు ప్రాధాన్యత కల్పించే దేశాన్ని నిర్మించేందుకు మనం కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Latest News