by సూర్య | Mon, Feb 17, 2020, 02:32 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు.
'ఎలక్షన్లలో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు ఎవరైనా. బాబు మాత్రం తన పరిస్థితిని ముందే అంచనా వేశాడు. ఎన్నికల్లో ఓడితే జైలుకు పోతా. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నన్ను గెలిపించాలి. అరెస్టు చేయడానికి వస్తే మీరంతా వలయంలా నిల్చుని రక్షణ కల్పించాలని భవిష్యవాణిని వినిపించాడు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Latest News