న్యాయ, పోలీసు శాఖ అధికారులపై ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్

by సూర్య | Mon, Feb 17, 2020, 02:28 PM

జ్యుడిషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 48 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇటీవలే విడుదలయ్యారు. తాజాగా ఆయన న్యాయ, పోలీసు శాఖ అధికారులపై రాజమండ్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అన్యాయంగా జైలులో ఉంచారని, అందుకు న్యాయ విభాగం, పోలీసు శాఖ అధికారులే కారణమని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎలాంటి తప్పుచేయకపోయినా 48 రోజుల పాటు జైలులో ఉంచారని, న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిలా చూశారని ఆరోపించారు. తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM