by సూర్య | Mon, Feb 17, 2020, 02:28 PM
జ్యుడిషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 48 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇటీవలే విడుదలయ్యారు. తాజాగా ఆయన న్యాయ, పోలీసు శాఖ అధికారులపై రాజమండ్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అన్యాయంగా జైలులో ఉంచారని, అందుకు న్యాయ విభాగం, పోలీసు శాఖ అధికారులే కారణమని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎలాంటి తప్పుచేయకపోయినా 48 రోజుల పాటు జైలులో ఉంచారని, న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిలా చూశారని ఆరోపించారు. తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు.
Latest News