by సూర్య | Sun, Feb 16, 2020, 07:37 PM
పంజాబ్లోని మోంగ జిల్లాలోని జలాల్పూర్ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ ఆదివారం ఉదయం 6 గంటలకు తన అత్తారింట్లో దారుణానికి పాల్పడ్డాడు. కుల్విందర్ సింగ్ తన బావమరిది నుంచి ఏడాది క్రితం కొంత స్థలం తీసుకొని అందులో పందుల ఫారం పెట్టాడు. కొన్ని నెలల క్రితం ఆ స్థలం వెనక్కు ఇవ్వమని బావమరిది అడుగుతుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లిన కుల్విందర్ సింగ్ బావమరిదితో కలిసి తాగాడు. కాసేపటి తరువాత స్థలం విషయంపై ఇద్దరి మధ్య గొడవ మళ్లీ మొదలైంది. ఇంట్లో తన భార్యతో సహా అందరూ తనకు వ్యతిరేకంగా ఉండడం చూసి అతను భార్య, బావమరిదిపై చేయి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కుల్విందర్ని అదుపులోకి తీసుకొని ఆ రాత్రంతా స్టేషన్లో ఉంచి ఉదయం 5 గంటలకు హెచ్చరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో అత్తవారు తనను పోలీసులకు పట్టించడం అవమానంగా భావించిన కుల్విందర్ సింగ్ రగిలి పోయి తన ఇంట్లో ఉన్న ఎకె-47 రైఫిల్తో అత్తారింట్లో ఉన్న అందరినీ కాల్చి చంపేశాడు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా బావమరిది పది ఏళ్ల కూతురు జస్ప్రీత్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కుల్విందర్ సింగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు
Latest News