by సూర్య | Sun, Feb 16, 2020, 07:06 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఖంగుతిన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆత్మ పరిశీలనతో సమయం వృధా చేయకుండా నేరుగా రంగంలోకి దిగిపోయింది. ఈసారి రాజ్యసభకు పెద్దలను కాకుండా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపించాలని సోనియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మరికొందరు జూనియర్లను కూడా రాజ్యసభకు పంపించి పార్టీకి కొత్త ఊపు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్యసభ సభలో సీనియర్లైన అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ సింగ్ కాల పరిమితి ముగియనుంది. అయితే పెద్దల సభకు ఎప్పటి లాగే పెద్దలను పంపించకుండా, పాత సంప్రదాయానికి పులిస్టాప్ పెట్టి కొత్త రక్తాన్ని రాజ్యసభకు పంపిస్తారని కాంగ్రెస్లోని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. అందులో భాగంగానే ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభ బరిలోకి దింపి, పార్టీని పటిష్టం చేయాలని సోనియా భావిస్తున్నట్లు సమాచారం.
Latest News