విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేసర్‌ మహ్మద్‌ షమీ !

by సూర్య | Sun, Feb 16, 2020, 06:59 PM

మూడు వన్డేల్లో వికెట్లు తీయనంత మాత్రాన జస్‌ప్రీత్‌ బుమ్రా అందించిన విజయాలను ఎలా మర్చిపోతారని విమర్శకులపై భారత పేసర్‌ మహ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా గాయపడి తిరిగొచ్చిన వెంటనే రాణించడం అంత సులువు కాదన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసిన అనంతరం షమీ మాట్లాడుతూ విమర్శకులకు చురకలంటించాడు. బయట కూర్చొని ఇతరులను విమర్శించడం సులువని కానీ, ఆడేవారికి తెలుస్తుందని ఆ బాధేంటోనని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మధ్య చాలా మంది ఆటగాళ్లను విమర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డాడు. ‘3-4 మ్యాచుల్లో బాగా ఆడకపోతే అతన్ని విమర్శిస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. కానీ ఓ మూడు మ్యాచుల్లో వికెట్లు తీయనంత మాత్రాన మ్యాచులను గెలిపించే బుమ్రా సత్తాను, అందించిన విజయాలను ఎలా మర్చిపోతారు. ఒక్క సిరీస్ వైఫల్యంతో అతడు సాధించింది అంతా పక్కన పెట్టేస్తారా? మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ ఆటగాడికి మంచిది. అది అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని వెంటనే రాణించడం కష్టమని ఒక క్రీడాకారుడిగా నాకు తెలుసు. వ్యాఖ్యానాలు చేస్తూ డబ్బులు సంపాదించేవారికి విమర్శించడం సులభం. ఆటగాళ్లకు గాయాలు సహజం. 2015లో నేనూ గాయపడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నాను' అని షమీ ఫైర్ అయ్యాడు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM