ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

by సూర్య | Sun, Feb 16, 2020, 04:37 PM

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో తొమ్మిది మంది అక్కడిక్కడే చనిపోయారు. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రయివేట్ టూరిస్ట్ బస్సు అతి వేగంతో వెళ్లడంతో అదుపు తప్పి లోయలో పడింది. ఉడిపి సమీపంలోని చిక్కమగుళూరు ఘాట్ రోడ్డు కార్కా తాలుగా మాళే సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే 9 మంది మరణించారు. మరొకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మైసూరుకు చెందిన ఓ ప్రయివేట్ సంస్థకు చెందిన ఉద్యోగులుగా గుర్తించారు. వీకెండ్ కావడంతో విహారయాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM