by సూర్య | Thu, Feb 13, 2020, 12:25 PM
ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని యనమల అన్నారు. ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని అయన ప్రశ్నించారు. జగన్ ఏడుసార్లు ఢిల్లీ వెళ్లి ఏం చేశారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారా అని ప్రశ్నించారు. కేంద్రానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని అయన అడిగారు. 3 రాజధానులతో పెట్టుబడులు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అయన అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని అన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చిన దాఖలాలు లేవని అన్నారు.
Latest News