హిజ్రాను కాల్చి చంపిన ప్రియుడు

by సూర్య | Wed, Feb 12, 2020, 07:52 PM

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం అనే పెనుభూతానికి హిజ్రా ప్రియుని చేతిలో హత్యకు గురైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమ్మదాబాద్ లోని వాల్మీకి నగర్ లో ఓ హిజ్రా నివసించేంది. హిజ్రా పేరు మమతా మసి. మమతా మసికి ప్రియుడు అజయ్ నలియాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో మమతా, అజయ్,మరో వ్యక్తి కలిసి వాల్మీకి నగర్ ఓ అద్దె రూం తీసుకొని అందులో ఉంటున్నారు. అజయ్ మరో హిజ్రాతో సంబంధం పెట్టుకున్నాడని మమతకు అనుమానం వచ్చింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య గత కొంత కాలంగా విబేధాలు నడుస్తున్నాయి. తాను ఎవరితో సంబంధం పెట్టుకోకపోయినా మమత తనను అనవసరంగా అనుమానిస్తుందని అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సోమవారం రాత్రి మరోసారి మమత,అజయ్ ల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అజయ్ తాను దాచుకున్న గన్ తీసి మమత పై కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే మమత ప్రాణాలు కోల్పోయింది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ కోసం గాలిస్తున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM