by సూర్య | Wed, Feb 12, 2020, 07:21 PM
విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఈ సంఘటన జరిగితే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థినికి న్యాయం జరగకపోతే కర్నూల్ లో జుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం లాభమని అన్నారు.
Latest News