by సూర్య | Wed, Feb 12, 2020, 03:20 PM
ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా నాయకత్వంలో దేశం శక్తివంతంగా ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీని నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్సీ వాకాణి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నా ఆధ్వర్యంలో నెల్లూరు బీజేపీ పార్లమెంట్ నియజకవర్గ అధ్యక్షుడిగా భరత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. పలువురు భరత్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
Latest News