by సూర్య | Wed, Feb 12, 2020, 03:14 PM
అమరావతిని అమరావతి దేవుడే రక్షిస్తాడని టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. మందడంలో రైతుల దీక్షకు ఆమె టీడీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గల్లా అరుణ మాట్లాడుతూ మంత్రులు ప్రతిరోజూ ఇదే దారిలో వెళ్తున్నా రైతులను పలకరించడం లేదన్నారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు చూడలేక పోతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబును ఓడించినప్పుడే దురదృష్టం పట్టిందన్నారు. మహిళల పోరాటం ఊరికే పోదని పేర్కొన్నారు.
Latest News