by సూర్య | Tue, Feb 11, 2020, 02:53 PM
అర్హులైన వారి పెన్షన్లను, తెల్లకార్డులను తొలగిస్తున్నారంటూ టీడీపీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. స్పందన కార్యక్రమంలోటీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి తదితరులు ఈ మేరకు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పనికిమాలిన కండిషన్లు పెడుతూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
Latest News