ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో ప్రభంజనం

by సూర్య | Tue, Feb 11, 2020, 11:52 AM

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో ప్రభంజనం సృష్టిస్తోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 70 సీట్లున్న దిల్లీలో  55 స్థానాల్లో ఆప్‌, 13 స్థానాల్లో భాజపా, ఇతరులు ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూదిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ప్రతాప్‌గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు.న్యూదిల్లీ, ఉత్తర దిల్లీలో ఆప్‌ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తోంది. షార్దా, దక్షిణ దిల్లీ, ఆగ్నేయ దిల్లీ, నైరుతి దిల్లీలో ఆప్‌ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. రోహిణి నియోజకవర్గంలో భాజపా నేత విజయేంద్ర కుమార్‌ ముందంజలో ఉన్నారు.


 


 

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM