సీఎం జగన్ కి మరోసారి షాకిచ్చిన సీబీఐ కోర్టు

by సూర్య | Fri, Jan 24, 2020, 05:57 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో మరోసారి షాకిచ్చింది. తనపై ఉన్నఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై.. ఈరోజు కోర్టు విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్న సీఎం జగన్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది. దీంతో ఇకపై జగన్ కోర్టుకి హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Latest News

 
వైఎస్ భారతి, అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు Wed, May 08, 2024, 07:37 PM
అప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడెలా అడుగుతావ్? పోసాని కృష్ణమురళి Wed, May 08, 2024, 07:34 PM
ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్ Wed, May 08, 2024, 07:30 PM
అప్పట్లో కేసీఆర్‌కు.. ఇప్పుడు జగన్‌కు.. షర్మిల రూటే సెపరేటు Wed, May 08, 2024, 07:27 PM
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM