by సూర్య | Fri, Jan 24, 2020, 05:49 PM
సోమవారం మండలి రద్దు జరిగినా వెంటనే అమల్లోకి రాదు అని యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రం, పార్లమెంట్, రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకూ మండలి ఉంటుంది. శాసన మండలి రద్దు జరిగినా సెలెక్ట్ కమిటీ పని చేస్తుంది అని యనమల అన్నారు. జగన్ కావాలంటే ఇడుపులపాయ బంకర్ నుంచి పాలన చేయవచ్చు అని అన్నారు. శాసన మండలిలో మంత్రుల దౌర్జన్యాన్ని గవర్నరుకు వివరించాం అన్నారు. మండలి చైర్మన్ ను పచ్చి బూతులు తిట్టారు. సెలెక్ట్ కమిటీ అంటే ఎందుకు ప్రభుత్వానికి భయం అని యనమల అన్నారు. సెలెక్ట్ కమిటీ అంటే ప్రజాభిప్రాయం తీసుకోవడమే అన్నారు.
Latest News