by సూర్య | Fri, Jan 17, 2020, 01:49 PM
వన్డే వరల్డ్కప్ ఓటమి అనంతరం దాదాపు 6 నెలలు క్రికెట్కు దూరమైన టీమిండియా సీనియర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. బీసీసీఐ కాంట్రాక్టులో చోటు కల్పించలేదని అతని అభిమానులు బీసీసీఐ గగ్గోలు పెడుతుంటే.. ధోని మాత్రం ఇవన్నీపట్టనట్లు రీ ఎంట్రీ కోసం సన్నాహకాలను ప్రారంభించాడు. పైగా రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్లో చోటు కోల్పోయిన రోజే మైదానంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను గురువారం ప్రాక్టీస్లో పాల్గొన్నాడు.బ్యాటింగ్తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్లో కూడా అతను పాల్గొన్నట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.‘ధోని ప్రాక్టీస్లో పాల్గొంటాడని మాకు కూడా తెలియదు. మహీ రావడం మాకు సర్ప్రైజ్.కాసేపు బ్యాటింగ్ చేశాడు. అనంతరం రెగ్యూలర్ ట్రైనింగ్లో పాల్గొన్నాడు. ధోని మాతో ట్రైనింగ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం.'అని తెలిపారు. ఇక ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా ధోని సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు ఈ జార్ఖండ్ డైనమైట్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. అయితే ఐపీఎల్ కోసమే అతను ప్రాక్టీస్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Latest News