ఆడపిల్లేనని అనుమానంతో ఘాతుకం

by సూర్య | Fri, Jan 17, 2020, 12:34 PM

సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్ష నేటికి తరడంలేదు. అన్ని రంగాల్లో అమ్మాయిలు రాణిస్తున్నా భ్రూణహత్యలు తగ్గడంలేదు. మగపిల్లాడిపై ఉన్న మమకారంతో ఓ భర్త తన భార్యను అతికిరాతకంగా చంపాడు. గర్భవతి అని చూడకుండా గొంతు నులిమి చంపి, ఆపై ముక్కలుగా చేసి పిండిమరలో వేసి ముద్ద చేశాడు. అనంతరం కాల్చి బూడిద చేసి అడవిలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని డీహ్‌కు చెందిన రవీంద్రకుమార్‌(35)- ఊర్మిళ(27)కు 2011లో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఊర్మిళ ఇటీవల గర్భం దాల్చింది. అయితే, ఈసారి కూడా ఆమె అమ్మాయికే జన్మనిస్తుందని అనుమానించిన భర్త రవీంద్రకుమార్ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ నెల 12న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని రవీంద్రకుమార్ కుటుంబం అవమానంగా భావించింది. ఇదే విషయమై భార్యతో గొడవ పడిన రవీంద్ర కుమార్ ఆమెను గొంతు నులిమిం చంపేశాడు. ఆ తర్వాత తండ్రి, సోదరులతో కలిసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం పిండిమరలో వేసి ముద్దచేశాడు. అక్కడితోనూ ఆగక కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత మూటకట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. అంతా ముగించుకున్న తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


తల్లిని తన తండ్రి చంపడాన్ని కళ్లారా చూసిన పెద్ద కుమార్తె తన అమ్మమ్మకు విషయం చెప్పింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న ఊర్మిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM