by సూర్య | Fri, Jan 17, 2020, 12:30 PM
సీబీఐ ఈడీ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కేసులో గత శుక్రవారం ఏడుగురు నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం నాటి విచారణకు ఏపీ సీఎం జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో సీఎం జగన్కు సీబీఐ న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
Latest News