by సూర్య | Fri, Jan 17, 2020, 11:55 AM
విజయవాడ : అమరావతి పరిరక్షణ సమితి ఐకాస సభ్యులు ఇవాళ గవర్నర్ను కలవనున్నారు. 3 రాజధానులపై గవర్నర్ బిశ్వభూషణ్కు చంద్రబాబు, అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్పై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో ర్యాలీ అడ్డగింత, పీఎస్లో నిర్బంధం గురించి తెలపనున్నారు. రైతుల ఆందోళన, రాజధాని మార్పుతో జరిగే నష్టాలను గవర్నర్కు వివరించనున్నారు.
Latest News