ధోని ఇండియా తరఫున మాత్రం మళ్లీ బరిలోకి దిగడు: హర్భజన్

by సూర్య | Thu, Jan 16, 2020, 06:30 PM

మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం దాదాపు ఆరునెలలు ఆటకు దూరంగా ఉన్న ధోనిని 2019-20 సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ తన ఐపీఎల్ కెప్టెన్ కెరీర్ గురించి ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ధోని రీ ఎంట్రీ ఉంటుందని అనుకోవడం లేదని తెలిపాడు. ' దాదాపు ధోని కెరీర్ ముగిసినట్టే. వన్డే వరల్డ్‌కప్ అతనికి ఇండియా తరఫున చివరి టోర్నీ అని విన్నా. ఆ టోర్నీ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. అతను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆడటం లేదు.'అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో రాణించినా అతను ఇండియా తరఫున ఆడడని స్పష్టం చేశాడు. 'ధోని ఐపీఎల్‌లో కచ్చితంగా రాణిస్తాడు. అతని హార్డ్ వర్క్‌ అలాంటిది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అతను ఫామ్‌లోకి వచ్చినా.. ఇండియా తరఫున మాత్రం మళ్లీ బరిలోకి దిగడు. ఇప్పటికే అతను వన్డే వరల్డ్ కప్‌లోనే చివరి మ్యాచ్ ఆడేశాడు.'అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక భజ్జీ ఐపీఎల్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM