ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తాం: పవన్‌

by సూర్య | Thu, Jan 16, 2020, 03:58 PM

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విజయవాడలో జనసేన-బీజేపీ కీలక భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు. జనసేన, బీజేపీ భావజాలం ఒక్కటిగానే ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభం చేకూరుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వైసీపీ తుంగలో తొక్కిందన్నారు. రాజధాని రైతులను నిండా ముంచిందని విమర్శించారు. 2024లో ఏపీలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామన్నారు. కో-ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 2024లో ఏపీలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM