by సూర్య | Thu, Jan 16, 2020, 03:55 PM
విజయవాడ : భాజపా, జనసేన నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. తాజా రాజకీయాలు, అమరావతి రైతుల ఆందోళనలపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం, ఇరుపార్టీలు కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. 2024 వరకు ఉమ్మడి కార్యాచరణపై సమగ్ర చర్చ జరుగుతోంది. సమావేశంలో భాజపా అగ్ర నేతలు కన్నా, సునీల్ దేవధర్, జీవీఎల్, పురందేశ్వరి, సోము వీర్రాజు.. జనసేన నేతలు పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
Latest News