by సూర్య | Thu, Jan 16, 2020, 12:56 PM
జెండా పీకడానికి, పార్టీ విలీనానికి జనసేన సిద్ధమైందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు పంపిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జనసేన పొత్తు 2014లోనే ఉందని మల్లాది అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనను ప్రజలు తిరస్కరించారు. అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు. పాచిపోయిన లాడ్డులంటూ గతంలో బీజేపీని పవన్ విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుతో మాకేమి నష్టం లేదు అన్నారు.
Latest News