by సూర్య | Thu, Jan 16, 2020, 12:56 PM
పాకిస్థాన్ లోని నీలం లోయలో మంచు తుఫాన్ విరుచుకుపడింది. పాక్ అక్రమిత కశ్మీర్ లో తుఫాన్ ధాటికి పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో 60 మంది మరణించగా.. పలువురికి గాయాలు అయ్యాయి. అఫ్ఘనిస్థాన్ లోనూ మంచు తుఫాన్ ప్రభావంతో 15 మంది మరణించారు. ఇక జమ్మూకశ్మీర్ లో మంచు విలయం సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు.
Latest News