by సూర్య | Tue, Jan 14, 2020, 07:37 PM
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ చట్టం వివాదస్పదంగా మారింది. దాదాపు 13 రాష్ట్రాలు సీఏఏను అమలు చేసేది లేదని స్పష్టం చేశాయి. అయితే ఈ వ్యవహారంపై తొలిసారిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తొలిసారిగా స్పందించారు. పౌరసత్వ చట్టం ఒకవైపు బాధ మరోవైపు విషాదం కలిగిస్తోందని తీవ్రంగా రియాక్టయ్యారు. అయితే సత్య నాదెళ్ల సీఏఏపై ఈ కామెంట్లు చేశారా..? లేదంటే భారతీయ పౌరులేవరు..? ఎవరు కాదన్న అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే సత్య నాదెళ్లను ఇంటర్య్యూ చేసిన ఎడిటర్ మాత్రం సీఏఏపై నాదెళ్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి తదుపరి ఇన్ఫోసిస్ సీఈవో కావాలని సత్య నాదెళ్ల చెప్పినట్టు స్మిత్ పేర్కోన్నారు.
Latest News