వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

by సూర్య | Tue, Jan 14, 2020, 07:36 PM

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యనించారు. తమ ఓపికను చేతగానితనమని అనుకుంటే వైసీపీ నేతలు మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు. కాకినాడలో జరిగిన లాంటి ఘటనలు మళ్లీ రీపిట్ అయితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ద్వారంపూడి వాడిన భాష క్షమించరానిది పవన్ అన్నారు. మమ్మల్ని పచ్చి బూతులు తిట్టి తమ వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పండగ సమయంలో లేనిపోని గొడవలు వైసీపీ నేతలు సృష్టించారని జనసేనాని ఆరోపించారు.


పోలీసులు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసులకు, దాడులకు భయపడేది లేదని పవన్ అన్నారు. కాకినాడలో వైసీపీ, జనసేన వర్గీయుల మధ్య జరిగిన దాడిలో జనసైనికులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM