by సూర్య | Tue, Jan 14, 2020, 07:23 PM
భోగి పండుగ రోజున ఓ కుటుంబంలో విషాదం జరిగింది. అమ్మఒడి డబ్బుల కోసం భార్యభర్తల మధ్య గొడవ జరిగి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి తన భర్తతో అమ్మఒడి డబ్బులకు సంబంధించి గొడవ జరిగింది. రెండు రోజుల క్రితమే అమ్మఒడి డబ్బులు వచ్చాయి. భర్త ఇవ్వాలని అడగడంతో ఆదిలక్ష్మీ ఇవ్వనని సమాధానమిచ్చింది. పిల్లలకు అవసరం ఉందని భర్తతో చెప్పింది. భర్త ఇవ్వాలని పట్టుబట్టాడు.
మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరగడందో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆదిలక్ష్మీ భర్త పై కోపంతో పురుగుల మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మీ చికిత్స పొందుతూ మధ్యాహ్నాం చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. భోగి పండగపూట క్షణికావేశాన ఆదిలక్ష్మీ ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News