by సూర్య | Tue, Jan 14, 2020, 06:53 PM
రాజధాని అమరావతిని తరలించడం ఎవరి వల్ల కాదని హరికృష్ణ కూతురు, తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని అన్నారు. రాజధాని ప్రాంతంలో మహిళలు చేస్తున్న ధర్నాలో ఆమె పాల్గోన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు సుహాసిని చెప్పారు. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది నిజమైతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నందమూరి సుహాసిని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఆసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి సుహాసిని ఓడిపోయారు. ఇటీవలే పాలిటిక్స్ లో నందమూరి సుహాసిని యాక్టివ్ అయ్యారు.
Latest News