by సూర్య | Tue, Jan 14, 2020, 02:16 PM
రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో రైతులు దీక్ష చేస్తున్నారు. రైతుల దీక్షకు టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. దీక్షలో కొద్దిసేపు కూర్చొని ఆమె రైతులకు మద్దతు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నందమూరి సుహాసిని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. అమరావతిని సాధించుకునే వరకు ఉద్యమం చేయాలని సుహాసిని పిలుపునిచ్చారు.
Latest News