by సూర్య | Mon, Jan 13, 2020, 05:59 PM
అమరావతిపై రెఫరెండం పెట్టాలని, వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు చంద్రబాబు. రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికల్లో ప్రజలు జగన్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోండి.. వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా. ఈ సీఎం దీనికి ఎలాగూ ఒప్పుకోరు. రాజధానిపై ఓటింగ్ నిర్వహించి అమరావతా? విశాఖ? అన్నది తేల్చాలి’’ అని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు బోగస్ రిపోర్టులని.. వాటిని భోగి మంటల్లో వేసి చలికాచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడ కూడా జోలె పట్టి విరాళాలు సేకరించారు.
Latest News