జనసేన కార్యకర్తలపై దాడి.. స్పందించిన చంద్రబాబు

by సూర్య | Mon, Jan 13, 2020, 06:28 PM

కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు ఆడే వికృత క్రీడ ఎన్నో రోజులు సాగదంటూ సీఎం వైఎస్ జగన్ ను చంద్రబాబు హెచ్చరించారు. కాకినాడలో నిన్న జరిగిన హింస, దౌర్జన్యాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మహిళలని కూడా చూడకుండా పోలీసుల సమక్షంలోనే వారిపై దాడి చేయడం.. రోడ్ల మీద వీరంగం వేయడం, ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనం అని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడిగింది దీనికోసమేనా జగన్ రెడ్డి గారూ.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM