by సూర్య | Mon, Jan 13, 2020, 03:38 PM
పౌరసత్వ సవరణ చట్టంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇన్నాళ్లూ ఆ అంశంపై మౌనంగా ఉన్న ఆయన.. ఇవాళ సీఏఏపై స్పందించారు. పార్లమెంట్లో సీఏఏకు మద్దతు పలికిన జేడీయూ.. పౌరసత్వ చట్టంపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నితీశ్ కోరారు. తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్సీని అమలు చేయబోమన్నారు. ప్రత్యేకంగా ఇవాళ బీహార్ అసెంబ్లీ ఒక రోజు కోసం సమావేశమైంది. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ.. నితీశ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. మతపరంగా పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని ఆర్జేడీ ఖండించింది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ సభలో మాట్లాడారు. సీఏఏపై చర్చ జరపాలన్నారు. సభ్యులు కోరితే సభలో చర్చిద్దామన్నారు.
Latest News