పిచ్చి తుగ్లక్ పాలన వలన ఏపీ.. బీహార్‌తో పోటీ పడే స్థాయికి దిగజారింది : లోకేష్

by సూర్య | Mon, Jan 13, 2020, 02:48 PM

రాష్ట్ర రాజధానిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ వాడిగా సంతోషిస్తున్నా.. భారతీయుడిగా బాధపడుతున్నానంటూ ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీలో పరిస్థితులపై గతంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలను జోడిస్తూ.. వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో పిచ్చి తుగ్లక్ పరిపాలన పుణ్యమా అని, పక్క రాష్ట్రంలోని పాలక పక్షం, ప్రతిపక్షం ఒకే తాటిపైకి వచ్చాయని లోకేశ్ ట్వీట్ చేశారు. పిచ్చి తుగ్లక్ పాలన వలన ఏపీ.. బీహార్‌తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి కర్మనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM