ఈనెల 17న నింగిలోకి జీశాట్‌-30 ఉప‌గ్ర‌హం

by సూర్య | Mon, Jan 13, 2020, 01:54 PM

ఇస్రో రూపొందించిన జీశాట్‌-30 ఉప‌గ్ర‌హాన్ని ఈనెల 17వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. ఏరియేన్‌-5 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతారు. ఫ్రెంచ్ గ‌యానాలోని కౌరు అంత‌రిక్ష కేంద్రం నుంచి ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. జీశాట్‌-30ని క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌గా త‌యారు చేశారు. జియో స్టేష‌న‌రీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్ల‌లో క‌మ్యూనికేష‌న్ సేవ‌ల‌ను అందిస్తుంది. జీశాట్ బ‌రువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో దీన్ని త‌యారు చేశారు. ఇన్‌శాట్‌-4ఏకు ప్ర‌త్యామ్నాయంగా జీశాట్‌-30 ప‌నిచేయ‌నున్న‌ది. భార‌త్‌తో పాటు అనుబంధ దేశాల‌కు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్‌లో సిగ్న‌ల్ అందిస్తారు. గ‌ల్ఫ్ దేశాల‌కు సీ బ్యాండ్ ద్వారా క‌వ‌రేజ్ ఇవ్వ‌నున్నారు. ఆసియాలో కొన్ని దేశాల‌తో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవ‌లు అందిస్తారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈనెల 17వ తేదీన 2.35 నిమిషాల‌కు ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపిస్తారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM