ప్రజలు ఎక్కువా? జగన్ ఎక్కువా? : ఆర్కేను ప్రశ్నించిన బుద్ధా వెంకన్న

by సూర్య | Mon, Jan 13, 2020, 02:08 PM

మంగళగిరి ఎమ్మెల్యే చేపట్టిన ర్యాలీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'ఆర్కేకి మంగళగిరి ప్రజలు ఎక్కువా? జగన్ ఎక్కువా? జగన్ మెప్పుకోసం ఇటువంటి పనులు చేద్దామనుకుంటున్నారు. ఇది కుదరదు. జగన్ ముఖ్యమా? ఓట్లేసి గెలిపించిన ప్రజలు ముఖ్యమా?' అని ప్రశ్నించారు.


'రైతులు ఉద్యమాలు చేస్తుంటే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఎమ్మెల్యేలను ఎక్కడా చూడలేదు. కోతికి కొబ్బరి కాయ దొరికనట్లు ఉంది. ప్రజలకు మంచి చేయాలని వీళ్లకు లేదు' అని బుద్ధా వెంకన్న అన్నారు.


'మంగళగిరిలో భద్రతా సిబ్బంది లేకుండా మీరు రోడ్లపైకి వస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళగిరిలో లోకేశ్ బాబు మళ్లీ పోటీ చేస్తారు. లోకేశ్ గెలిస్తే అమరావతిని ఇక్కడే ఉంచండి. ఈ సవాలుకి ఒప్పుకుంటారా? నాటకాలు ఆడొద్దు.. మా సవాలును స్వీకరించాలి' అని బుద్ధా వెంకన్న అన్నారు.


'మా సవాలు స్వీకరిస్తే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారో, సానుకూలంగా ఉన్నారో తెలిసిపోతుంది. ఆర్కే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఆయనొక బొమ్మలాంటి వారు. జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారు' అని బుద్ధా వెంకన్న చెప్పారు.


జగన్ దెబ్బకి ఏపీ వారు తెలంగాణకు వెళ్తున్నారని, సంక్రాంతి రోజైనా అమరావతి రాజధానిపై మనసు మార్చుకోవాలని బుద్ధా వెంకన్న  విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM