రేపు 29 గ్రామాల రైతులు ర్యాలీ...

by సూర్య | Mon, Jan 13, 2020, 01:00 PM

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరూ మంత్రి బొత్స సత్యనారాయణను కలవలేదని, కలిసినట్టు వార్తలు సృష్టించారని ఆందోళన చేస్తున్న వారు స్పష్టం చేశారు. నిరసన తెలియజేస్తున్న రైతులు మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉందంటూ మా ఆందోళనను అణగదొక్కుతున్న పోలీసులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.


రేపు 29 గ్రామాల రైతులు ర్యాలీ నిర్వహిస్తారని, జరిగే పరిణామాలకు డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్కే పాదయాత్ర వారి కార్యకర్తల కోసమేనని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆర్కే తమను కలవాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏ ఒక్కరూ పండగ చేసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM