గులాబీ పూలు పంపిణి చేసి నిరసన తెలిపిన టిడిపి శ్రేణులు

by సూర్య | Mon, Jan 13, 2020, 01:05 PM

రాజధాని అమరావతిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఉదయం వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పార్టీ నేత టీఎస్ఎన్ఎఫ్ బ్రహ్మం ఆధ్వర్యంలో వాహన చోదకులకు గులాబీ పూలు అందించి మద్దతు అర్థించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి పలువురు ఆంధ్రాకు తరలివస్తున్నారు. వీరందరికీ గులాబీలు అందజేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ నిరసనకు మంచి స్పందన కనిపించింది.

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM