by సూర్య | Mon, Jan 13, 2020, 12:57 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. అమరావతిలో జరుగుతోన్న పరిణామాలకు నిరసనగా తమ కుటుంబం ఈ సారి సంక్రాంతి పండుగ చేసుకోదని చంద్రబాబు తెలిపిన విషయం తెలిసిందే.
'సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపుకునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయి ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
Latest News