by సూర్య | Sun, Jan 12, 2020, 07:50 PM
ఏపీలో పరిపాలన ఎటుపోతోందని సీఎం జగన్ కు టీడీపీ నేత వర్ల రామయ్య సూటి ప్రశ్నవేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిని తరలించడానికి, మూడు ముక్కలు చేయడానికి వీల్లేదని రాష్ట్రంలో మహాఉద్యమం నడుస్తోందని అన్నారు. ఈ ఉద్యమానికి ‘కౌంటర్ ఉద్యమం’ ప్రారంభిస్తారా? అంటూ జగన్ పై మండిపడ్డారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేయకుండా ఇలా కౌంటర్ ఉద్యమం నిర్వహించేలా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా? అని మండిపడ్డారు.
Latest News