by సూర్య | Sun, Jan 12, 2020, 07:52 PM
ఎస్వీబీసీ ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఎస్వీబీసీ ఛానెల్ కు చెందిన మహిళా ఉద్యోగినితో పృథ్వీరాజ్ అసభ్యకరంగా మాట్లాడినట్లు ఎస్వీబీసీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన పృథ్వీరాజ్ తానే తప్పు చేయలేదని.. తన వాయిస్ ని మార్ఫింగ్ చేశారంటూ ఆరోపించారు. తన మాటల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని.. పద్మావతి గెస్ట్ హౌస్ లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డానన్నది అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి తప్పుంటే శిక్షించాలని స్పష్టం చేశారు. మరోవైపు రాజధాని మహిళల గురించి మాట్లాడుతూ... తన మాటలు నొప్పించి ఉంటే అమరావతి రైతులకు క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.
Latest News