ఇలా చేయడం అత్యంత దురదృష్టకరం : పవన్ కళ్యాణ్

by సూర్య | Sun, Jan 12, 2020, 07:41 PM

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసి ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. పైగా సభ్య సమాజం చీత్కరించుకునే పదజాలం ఉపయోగించి మాట్లాడడమే కాకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం అత్యంత దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు.


తప్పును తప్పు అని చెబుతున్న వారిపై అరాచక శక్తులతో దాడి చేయిస్తే జన సైనికులు వెనుకంజ వేస్తారని భావించవద్దని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలకు అన్యాయం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితే వస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడ వస్తానని హెచ్చరించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM