ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్లి

by సూర్య | Sun, Jan 12, 2020, 05:13 PM

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న బీజేపీ కోర్ కమిటీ తీర్మానం గురించి వెల్లంపల్లి ప్రస్తావిస్తూ, అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు లక్ష కోట్ల రూపాయలను బీజేపీ కనుక ఇస్తే రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని, కేంద్ర నిధులను కన్నా లక్ష్మీనారాయణ తెప్పిస్తే ఆయన పేరిట రాజధానిని నిర్మిస్తామని సెటైర్లు విసిరారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు కేంద్రానికి చెప్పలేదా? అని ప్రశ్నించిన వెల్లంపల్లి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కు విజన్ లేదని ప్యాకేజ్ ఇస్తే చాలని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని, చంద్రబాబు ఉచ్చులో పడొద్దని రైతులకు సూచించారు.

Latest News

 
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM