by సూర్య | Sun, Jan 12, 2020, 03:37 PM
టీమిండియా టెస్ట్ బ్యాట్స్మన్ 'నయా వాల్' ఛటేశ్వర్ పుజారా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. శనివారం కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాడు పుజారా (162 బ్యాటింగ్; 17 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81)లు ముందు వరసలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ (68), విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55), మొహమ్మద్ అజహరుద్దీన్ (54)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజా సెంచరీతో పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Latest News