పుజారా ఖాతాలో అరుదైన మైలురాయి!

by సూర్య | Sun, Jan 12, 2020, 03:37 PM

టీమిండియా టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ 'నయా వాల్' ఛటేశ్వర్‌ పుజారా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. శనివారం కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు పుజారా (162 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్‌ గావస్కర్‌ (81), సచిన్‌ టెండూల్కర్‌ (81)లు ముందు వరసలో ఉన్నారు. రాహుల్‌ ద్రవిడ్‌ (68), విజయ్‌ హజారే (60), వసీమ్‌ జాఫర్‌ (57), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (55), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (55), మొహమ్మద్ అజహరుద్దీన్‌ (54)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజా సెంచరీతో పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM