జల్లికట్టులో విషాదం.. ఒకరి మృతి

by సూర్య | Sun, Jan 12, 2020, 03:34 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిన్నబల్థారులో విషాదం నెలకొంది. జల్లికట్టులో ఓ యువకుడిపై ఎద్దు బలంగా దూసుకెళ్లడంతో అతడు మరణించాడు. మరో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జల్లికట్టులో పాల్గోనేందుకు తమిళనాడు నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి యేడాది సంక్రాంతికి నెల రోజుల ముందు జల్లికట్టు పోటీలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తూంటారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా స్థానిక ప్రజలు జల్లికట్టును నిర్వహించారు. తొలిసారిగా ఏపీలో జల్లికట్టు క్రీడలో ఒకరు చనిపోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఈ రాక్షస క్రీడకు తమిళనాడులో జల్లికట్టుకు విపరీతమైన ఆదరణ ఉంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM