by సూర్య | Sun, Jan 12, 2020, 03:34 PM
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిన్నబల్థారులో విషాదం నెలకొంది. జల్లికట్టులో ఓ యువకుడిపై ఎద్దు బలంగా దూసుకెళ్లడంతో అతడు మరణించాడు. మరో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జల్లికట్టులో పాల్గోనేందుకు తమిళనాడు నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి యేడాది సంక్రాంతికి నెల రోజుల ముందు జల్లికట్టు పోటీలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తూంటారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా స్థానిక ప్రజలు జల్లికట్టును నిర్వహించారు. తొలిసారిగా ఏపీలో జల్లికట్టు క్రీడలో ఒకరు చనిపోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఈ రాక్షస క్రీడకు తమిళనాడులో జల్లికట్టుకు విపరీతమైన ఆదరణ ఉంది.
Latest News