పోలీసులు ఏ విధంగా దాడి చేసిందీ వివరించిన తుళ్లూరు మహిళలు

by సూర్య | Sun, Jan 12, 2020, 03:23 PM

ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఉద్యమం క్రమంగా హింసాత్మక రూపు దాల్చుతోంది. ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసు దాడి తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో, తుళ్లూరు గ్రామ మహిళలపై పోలీసు చర్య పట్ల సుమోటోగా స్పందించిన జాతీయ మహిళా  కమిషన్ ఏపీకి కదిలివచ్చింది. తుళ్లూరులో అసలేం జరిగిందన్న అంశం నిగ్గుతేల్చేందుకు మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది.


ఈ క్రమంలో తుళ్లూరు వచ్చిన కమిటీ సభ్యులు ప్రవీణ్ సింగ్, కాంచన కట్టర్ తదితరులు తొలుత మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆపై తుళ్లూరు చేరుకుని డీఎస్పీతోనూ, తహసీల్దార్ తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా తుళ్లూరు మహిళలు  కమిషన్ సభ్యులతో మాట్లాడుతూ తమపై పోలీసులు ఏ విధంగా దాడి చేసిందీ వివరించారు. అంతేకాదు, కొందరు వీడియో సాక్ష్యాలను కూడా కమిషన్ ముందుంచారు. కాగా, ఈ పర్యటనలో జాతీయ మహిళా కమిషన్ సభ్యుల వెంట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM