by సూర్య | Mon, Oct 14, 2019, 12:19 PM
కారు ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీఆటగాళ్లు మృతి చెందగా ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించారు.జాతీయ రహదారి 69 పై ఈరోజు ఉదయం హోసంగాబాద్లోని రాసాల్పూర్ వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి బోల్తాకొట్టడంవల్ల నలుగురు హాకీఆటగాళ్లు అక్కడికిఅక్కడే మరణించారు. అతి వేగంవల్ల హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఇతార్సి నుంచి హోసంగాబాద్కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Latest News