కాంస్యంతో సరిపెట్టుకున్న మేరీకోమ్

by సూర్య | Sun, Oct 13, 2019, 07:36 AM

భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌‌కి మరోసారి నిరాశ ఎదురైంది. రష్యాలోని ఉలాన్ ఉదె వేదికగా శనివారం టర్కీ బాక్సర్‌ బుసెంజ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 1-4 తేడాతో పరాజయ పాలైంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఈ పతకం గెలవడం ద్వారా.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా మేరీకోమ్ అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఆమె ఆరు సార్లు స్వర్ణం, ఒకసారి రజతం గెలిచింది. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం 48 కేజీల విభాగం నుంచి ఇటీవల 51 కిలోల కేటగిరీకి మారిన మేరీకోమ్‌కి ఇదే తొలి టోర్నీకాగా.. అనూహ్యంగా సెమీస్‌లో ఓడటం ఆమెని ఒత్తిడిలోకి నెట్టే అంశమే. 48 కేజీల విభాగంలో తిరుగులేని బాక్సర్‌గా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్.. ఈరోజు సెమీస్ మ్యాచ్‌లో టర్కీ బాక్సర్‌కి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగంలో బాక్సింగ్‌ పోటీలు నిర్వహించబోమని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించేసిన విషయం తెలిసిందే.వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో క్యూబాకి చెందిన బాక్సర్‌ పెలిక్స్ ఏడు పతకాల రికార్డ్‌ని గత ఏడాది సమం చేసిన మేరీకోమ్.. ఈరోజు కాంస్య పతకంతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి 8 పతకాలతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Latest News

 
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM
ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్ Mon, Apr 29, 2024, 07:57 PM
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM