by సూర్య | Sun, Oct 13, 2019, 07:39 AM
అమరావతి: విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి ఆర్ కె సింగ్ కు లేఖ రాసిన బాలినేని సౌర, పవన విద్యుత్ ఒప్పందాల వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రం ఈ ఒప్పందాల వలన ఏటా ఐదువేల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తుందని, పీపీఏల వలన డిస్కంలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, సంక్షభం నుండి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. సంక్షోభ పరిష్కరానికి కేంద్ర విద్యుత్ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేయాలని, సౌర, పవన్ విద్యుత్ వినియోగానికి కేంద్రం రాయితీలు ఇవ్వాలని లేఖలో కోరారు.
Latest News